గీతగోవిందంలో హీరోయిన్గా తొలి ఎంపిక ఆమెనే..
23 March 2025
Prudvi Battula
రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీరీలో బిగెస్ట్ హిట్గా నిలిచిన సినిమా గీతగోవిందం. ఇందులో రష్మిక కథానాయిక.
పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. విజయ్, రష్మిక ఇద్దరికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది ఈ సినిమా.
అయితే ఈ సినిమాకు రష్మిక కంటే ముందు మరో హీరోయిన్ను ఎంపిక చేశాడట దర్శకుడు పరశురామ్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..
గీతగోవిందం లాంటి సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరంటే.. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.
దర్శకుడు ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా లావణ్యను అనుకున్నారట. కానీ ఈ చిత్రానికి నో చెప్పాడానికి లావణ్యకు ఓ రీజన్ ఉందట.
అయితే ఈ మూవీలో లిప్ లాక్ సన్నివేశం ఉండటంతో లావణ్య నో చెప్పిందని సమాచారం. లిప్ లాక్ సీన్తోనే ఈ మూవీ స్టోరీ టర్న్ అవుతుంది.
అయితే అలాంటి సీన్ లో నటించడం ఇష్టం లేక సినిమాను మిస్ చేసుకుందట హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఈ మూవీతో రష్మిక క్రేజ్ మారిపోయింది.
గీతా గోవిందం కంటే ముందు శ్రీరస్తు శుభమస్తు అనే సినిమాలో లావణ్య హీరోయిన్గా నటించింది. పెళ్లి తర్వాత సెలెక్టివ్ సినిమాలు చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కాలేజ్ డేస్లో బాడీ షేమింగ్.. కట్ చేస్తే.. సోయగంతో సెగలు..
ఆ స్టార్ హీరోలు మహేష్కి క్లాస్ మేట్స్ అని తెలుసా.?
ఆ సినిమా డబ్బింగ్కి వెళ్లి షాక్ అయ్యాను: ప్రియా భవాని శంకర్..