మతిపోగొడుతున్న తెలుగమ్మాయి.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
12 october 2025
Rajeev
శాన్వి మేఘన 1998 సెప్టెంబరు 12న హైదరాబాద్లో జన్మించింది. ఈ ముద్దుగుమ్మ 2019లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
“సైరా నరసింహారెడ్డి” సినిమాతో తన సినీ జర్నీని ప్రారంభించింది. ఆ తర్వాత “పిట్ట కథలు” , “బిలాల్పూర్ పోలీస్ స్టేషన్”, “పుష్పక విమానం”, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్” సినిమాలు చేసింది.
తెలుగులో ఈ అమ్మడు ఇప్పటివరకు ఆరు సినిమాలు చేసింది. అలాగే తమిళ్ లో ఓ సినిమా చేసింది.
తమిళ్ లో ఆమె కుటుంబస్థాన్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
తెలుగులో రీసెంట్ గా టుక్ టుక్ అనే సినిమా చేసింది. చేసిన సినిమాలన్ని మంచి టాక్ సొంతం చేసుకున్నా ఈ భామకు మాత్రం అంతగా గుర్తింపు రాలేదు.
సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది ఈ అమ్మడు. ఇప్పటికైన ఈ అమ్మడికి పెద్ద సినిమా ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.
ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఈ భామ కొన్ని పిక్స్ పంచుకుంది.