పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది కన్నడ నటి రష్మిక మందన్నా. ఇందులో శ్రీవల్లిగా ఆమె అభినయం అందరి ప్రశంసలు అందుకుంది.
పుష్ప తర్వాత రష్మిక నటించిన మరో పాన్ ఇండియా సినిమా యానిమల్. ఈ సినిమా కూడా ఏకంగా రూ. 900 కోట్లు సాధించింది.
గత ఏడాది పుష్ప 2 మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఇటీవల ఛావా సినిమా మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ.
ప్రస్తుతం తెలుగులో కుబేర, ది గర్ల్ ఫ్రెండ్; హిందీలో థమా మూవీస్ షూటింగులతో ఫుల్ బిజిబిజీగా గడుపుతోంది. ఒక ప్రముఖ నటి బయోపిక్లో నటించాలనుకుంటోంది ఈ బ్యూటీ.
ఆ నటి మరెవరో కాదు.. దివంగత హీరోయిన్ సౌందర్య. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టింది రష్మిక.
కాగా సౌందర్య కూడా కన్నడ భామ అన్న విషయం తెలిసిందే. అయితే ఆమె తెలుగు, తమిళం భాషల్లోనే ఎక్కువ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
‘సౌందర్య బయోపిక్ లో నటించాలని చాలామంది హీరోయిన్లకు ఉంది. నాకు కూడా ఈ కోరిక ఉంది’ అని రష్మిక చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప 2, కుబేర వంటి క్రేజీ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అలాగే కొన్ని లేడీ ఓరియండెట్ మూవీస్ లోనూ నటిస్తోందీ అందాల తార.