గ్లామర్ లుక్‌లో రకుల్.. హాట్ సమ్మర్‌లో కూల్ కూల్‌గా..

samatha 

11 march 2025

Credit: Instagram

టాలీవుడ్ స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని వివాహం చేసుకొని, సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తుంది ఈ బ్యూటీ.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా  తన ఫ్యామిలీతో మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేసింది ఈబ్యూటీ.

కెరటం సినిమాతో వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. అనతికాలంలోనే వరస సినిమాలతో టాలీవుడ్‌నే షేక్ చేసింది.

కరెంట్ తీగ, సరైనోడు, ధృవ, కిక్2 బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో ఇలా చాలా సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ.

తర్వాత బాలీవుడ్ ‌లో మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మరో వైపు బిజినెస్‌లు చూసుకుంటూ చాలా బిజీగా గడిపేస్తుంది.

అయితే తాజాగా ఈ బ్యూటీ తన భర్త, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి మాల్దీవ్స్ వెకేషన్‌కు వెళ్లింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోలను ఈ అమ్మడు తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది.

రకుల్ బీచ్‌లో తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్, అలాగే, రిసాట్‌లో తన భర్తతో దిగిన ఫొటోస్, ఫ్యామిలీతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.