కౌసల్య కృష్ణ మూర్తి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ముద్దుగమ్మ ఐశ్వర్యా రాజేష్. ఈ నటి టాలీవుడ్లో రాంబంటూ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా నటించింది.
ఇక ఈ అమ్మడు లేటెస్ట్గా సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బ్యూటీ ఐశ్వర్యరాజేష్. మూవీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తూ ఫుల్ జోష్లో ఉంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన హీరో భార్యగా, భాగ్యంపాత్రలో నటించి ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
దీంతో ఈ బ్యూటీకి తెలుగులో అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఎవరినోట విన్నా ఈ నటి పేరే వినిపిస్తుంది.
చూడటానికి మాములు గృహిణిలా కనిపించే ఈ ముద్దుగుమ్మ, తన నేచురల్ నటనతో అభిమానులను కట్టిపడేస్తుంది.
ఇక మూవీ సక్సెస్ జోష్లో ఉన్న ఈ అమ్మడు తాజాగా తన అందాలతో కుర్రకారుకు బాణాలు విసిరింది. పసుపు రంగు చీర ధరించి ఎంతో అందంగా కనిపించింది.
ట్రెడిషనల్ లుక్లో, చూడటానికి చాలా పద్ధతిగా ఉంది ఐశ్వర్యా రాజేష్. శారీలో తన వయ్యారాలను ఒలుకబోస్తూ.. అందరినీ మరోసారి తనవైపుకు తింపుకుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. దీంతో భాగ్యం చీరలో చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్