గీతగోవిందంలో హీరోయిన్‎గా తొలి ఎంపిక ఆమెనే..

23 March 2025

Prudvi Battula 

Credit: Instagram

ఈ మధ్య కాలంలో పెళ్లి అంటేనే యువత భయపడుతున్నారు. వివిధ కారణాలతో అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలు సింగిల్‌గానే ఉండిపోతున్నారు.

ఇలాంటి వాళ్లలో సినిమా హీరో, హీరోయిన్లు కూడా ఉన్నారు. గతంలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ తన పెళ్లిపై సంచలన ప్రకటన చేసింది.

మలయాళంలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య.. తెలుగులో 'గాడ్సే', 'అమ్ము' తదితర చిత్రాల్లో నటించింది.

'జీవితంలో నేను పెళ్లి చేసుకోను. చాలా బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. నాకు తెలిసిన చాలామందిని చూశాను'.

'చాలామంది రాజీ పడి బతుకుతున్నారు. పెళ్లి, పిల్లల వల్ల చాలామంది వ్యక్తిగతంగా కూడా పైకి ఎదగలేకపోతున్నారు'.

'కొన్నేళ్ల క్రితం గురువాయూర్ గుడిలో చాలా పెళ్లిళ్లు చూశాను. అవి చూసినప్పుడల్లా నేను కూడా అలానే చేసుకోవాలనిపించింది.

అయితే పెద్దయిన తర్వాత పెళ్లి గురించి ఫుల్ క్లారిటీ వచ్చింది.ఇక జీవితంలో పెళ్లి వద్దని ఫిక్సయ్యాను' అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.

అప్పట్లో ఈ క్రేజీ హీరోయిన్ కామెంట్స్ నెట్టింట బాగా వైరల్‎గా మారాయి. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు.