టాలీవుడ్ ను పూర్తిగా మర్చిపోయిన అందాల భామ .. ఈ అమ్మడు గుర్తుందా.?

Rajeev 

10 March 2025

Credit: Instagram

 తెలుగు సినీ పరిశ్రమలో అందం, అభినయంతో అలరించిన హీరోయిన్లలో కృతి కర్బంద ఒకరు. బోణీ సినిమాతో వెండితెరకు పరిచయమైంది.

కానీ ఆ సినిమాతో ఏమాత్రం గుర్తింపు రాలేదు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ చిన్నది.

ఆ తర్వాత అలా మొదలైంది, తీన్మార్, మిస్టర్ నూకయ్య చిత్రాల్లో కనిపించింది. అందంతో పాటు నటన పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. 

కానీ రామ్ పోతినేని జోడిగా నటించిన ఒంగోలు గిత్త సినిమాతో ఈ బ్యూటీకి పాపులారిటీ వచ్చేసింది.

కానీ అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. చాలా కాలంగా తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటుంది కృతి. 

మొన్నామద్యే తన ప్రియుడు బాలీవుడ్ హీరో పుల్కిత్ సామ్రాట్ తో పెళ్లి చేసుకొని, వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.

ప్రస్తుతం ఈ చిన్నది హిందీ సినిమాల పైనే ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది ఈ అమ్మడు.