విమానం గాల్లో ఉండగానే షాకింగ్‌ సంఘటన.. ప్రయాణికుల్లో భయం..కట్ చేస్తే..

4 July, 2025

Subhash

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ప్రజలు విమానం ఎక్కడానికి తెగ భయపడుతున్నారు. ప్రతిరోజూ జరుగుతున్న విమాన ప్రమాదాల వార్తలతో ప్రజలు భయపడుతున్నారు. 

విమానం 

ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రమాదకరమైన ప్రమాదం తృటిలో తప్పింది. గోవా నుండి పూణే వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో పెద్ద నిర్లక్ష్యం కనిపించింది.

తృటిలో తప్పింది

విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఒక కిటికీ సగానికి విరిగి గాలిలో వేలాడుతుండగా విమానంలో గందరగోళం నెలకొంది. 

ఒక కిటికీ సగానికి విరిగి

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానం కిటికీ విరిగిపోవడంతో ప్రయాణికుల్లో భయం నెలకొంది.

సోషల్ మీడియాలో 

ఈ సంఘటనలో విమానం కిటికీ విరిగిపోవడం వల్ల విమానం లోపల కూర్చున్న ప్రయాణికులందరూ భయపడ్డారు. 

వైరల్ వీడియో

కానీ అదృష్టం ఏంటంటే.. దాని కిటికీ విరిగిపోయినా గాజుతో కూడిన బయటి భాగం చెక్కుచెదరకుండా ఉంది. లేకపోతే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. 

అదృష్టం ఏంటంటే.

దీనిపై ఎయిర్‌లైన్ సంస్థ ఏం చెప్పిందంటే.. ల్యాండింగ్ తర్వాత విండో ఫ్రేమ్‌ను సరిచేశామని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాదం విమానంలో కూర్చున్న వారిలో భయాందోళనలను రేకెత్తించింది. 

స్పైస్‌జెట్ ఏం చెప్పింది?

 విమానం మొత్తం ప్రయాణంలో విమానం లోపల ఒత్తిడి సాధారణంగానే ఉందని, విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణీకులెవరికీ ఎటువంటి హాని జరగలేదని ఎయిర్‌లైన్ కంపెనీ స్పైస్‌జెట్ తెలిపింది. 

విమానం లోపల