శుభవార్త..శాంసంగ్‌ నుంచి ట్రై-ఫోల్డ్‌ మొబైల్‌ ఎప్పుడు వస్తుందో తెలుసా?

12 July, 2025

Subhash

దక్షిణ కొరియాకు చెందిన టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ సరికొత్త మొబైల్‌లను తీసుకువస్తోంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త స్మార్ట్‌ ఫోన్‌లను తయారు చేస్తోంది.

శాంసంగ్‌ 

కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీ దిగ్గజం సామ్‌సంగ్‌.. ఈ ఏడాది చివరినాటికి ట్రై-ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

సామ్‌సంగ్‌

దేశీయ మార్కెట్లోకి గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 7, ఫ్లిప్‌ 7 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసిన అనంతరం కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ మిన్సోయిక్‌ కాంగ్‌ మాట్లాడారు. దీని గురించి సమాచారం అందించారు.

దేశీయ మార్కెట్లోకి

వచ్చే ఆరు నెలల్లో మూడు మడతలు (ట్రై-ఫోల్డ్‌) కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు.

మూడు మడతలు (ట్రై-ఫోల్డ్‌)

ప్రస్తు తం ఈ ఫోన్‌ అభివృద్ధి దశలో ఉన్నదని, న్యూఢిల్లీకి సమీపంలో ఉన్న ప్లాంట్లో ఉత్పత్తిని ప్రారంభించినట్టు కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ మిన్సోయిక్‌ కాంగ్‌ తెలిపారు. 

అభివృద్ధి దశలో

ఇప్పటికే చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ హ్యువాయ్‌ ఇప్పటికే ట్రై-ఫోల్డ్‌ ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 

ట్రై-ఫోల్డ్‌ ఫోన్‌

శాంసంగ్ అనేది దక్షిణ కొరియాకు చెందిన ఒక బహుళజాతి సంస్థ. ఇది ఎలక్ట్రానిక్స్, ఫైనాన్స్, కెమికల్స్, ఆటోమోటివ్ పార్ట్స్, హెవీ ఇండస్ట్రీస్, హోటల్స్, ఇంకా ఇతర రంగాలలో పనిచేస్తుంది.

శాంసంగ్ 

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలలో ఒకటి. అలాగే అనేక రకాల ఉత్పత్తులు, సేవలను అందిస్తుంది. ఈ కంపెనీకి ఎంతో మంది అభిమానులున్నారు.

టెక్నాలజీ కంపెనీలలో