18 March 2025
Subhash
ప్రముఖ దేశీయ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి వినియోగదారులకు షాకిచ్చింది. తమ కంపెనీకి చెందిన వాహనాల ధరలను పెంచనున్నట్లు వెల్లడించింది.
ముడి సరుకుల ధరలు పెరగడం, తయారీకి ఖర్చు పెరగడం వల్ల ఈ ధరలను పెంచుతున్నట్లు మారుతి సుజుకీ స్పష్టం చేసింది.
ఈ కార్ల ధరల పెంపు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. అలాగే ధరలను 4 శాతం పెంచునున్నట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది.
ముడి సరకుల ధరలు పెరగడం, నిర్వహణ ఖర్చులు అధికమవుతున్న క్రమంలో తమ కార్ల ధరలను పెంచాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ధరల పెరుగుదల 2025 ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది.
ధరల పెంపు అనేది మోడల్ ఆధారంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ధరల నియంత్రణ చేపట్టి మా కస్టమర్లపై భారాన్ని తగ్గించేందుకే కంపెనీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది.
కానీ, కొన్ని అంశాల్లో ధరలు పెరగడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో కార్ల ధరలను పెంచాల్సి వస్తోంది. అని రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.
గా, ఈ ఏడాదిలో మారుతి సుజుకి తమ కంపెనీ వాహన ధరలను పెంచడం ఇది రెండోసారి. అంతకుముందు జనవరిలో కార్ల ధరలను పెంచింది మారుతి సుజుకి.
కారు మోడల్ ఆధారంగా అత్యధికంగా రూ.32,500 వరకు పెంచింది. మళ్లీ ఏప్రిల్ నుంచి మారుతి సుజుకి వాహనాల ధరలను 4శాతం పెంచుతామని ప్రకటించింది.