19 February 2025
Subhash
రిలయన్స్ జియో ఉచిత ట్రయల్ను అందిస్తోంది. జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ సేవలు ప్రారంభం అయ్యాయి. ఈ ఆఫర్కు కంపెనీ ‘జీరో రిస్క్ ట్రయల్’ అని పేరు పెట్టింది.
కంపెనీ ప్రస్తుత ప్లాన్లో వినియోగదారులకు ఉచిత ట్రయల్ ఆఫర్ను కూడా అందిస్తున్నారు. ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆఫర్ కొత్త, ఇప్పటికే ఉన్న సబ్స్క్రైబర్లకు కూడా అందుబాటులో ఉంది.
ఈ ఆఫర్ను జియో ఫిబ్రవరి 28, 2025 వరకు అందిస్తోంది. ఈ ఆఫర్కు సబ్స్క్రైబ్ చేసుకుంటే వారికి జియో ఫైబర్, జియో ఎయిర్ఫైబర్ ఇంటర్నెట్ సర్వీస్ 50 రోజుల ఉచిత ట్రయల్ అందిస్తుంది.
టీవీ ఛానెల్లు, OTT యాప్లు కూడా ఇందులో చర్చింది జియో. వినియోగదారులకు ఉచిత సెట్-టాప్-బాక్స్, ఉచిత రూటర్, ఉచిత ఇన్స్టాలేషన్ను కూడా అందిస్తోంది.
కొత్త కస్టమర్లు 50 రోజుల ట్రయల్ తో వచ్చే రూ.1234 రీఫండబుల్ మొత్తాన్ని చెల్లించాలి. ట్రయల్ తర్వాత సర్వీస్ కొనసాగించాలనుకుంటే, అతనికి రూ. 1234 క్రెడిట్ లభిస్తుంది.
అతను ఈ క్రెడిట్ను 50 రోజుల పాటు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు మీరు 50 రోజుల తర్వాత రూ.599 ప్లాన్ను కొనుగోలు చేస్తే, మీ వాలెట్లోని బ్యాలెన్స్ రూ.1234 అవుతుంది.
మొదటి రీఛార్జ్ దీని నుండి అవుతుంది. మిగిలిన బ్యాలెన్స్ను తదుపరి రీఛార్జ్లో ఉపయోగించవచ్చు. సేవను కొనసాగించకూడదనుకుంటే రుసుము తగ్గించిన తర్వాత అతనికి రూ. 979 రీఫండ్ లభిస్తుంది.
ఈ ఆఫర్ను యాక్టివేట్ చేసుకోవడానికి, ఇప్పటికే ఉన్న వినియోగదారులు వాట్సాప్లో సందేశం పంపాలి. దీనిలో, వారు ‘ట్రయల్’ అని వ్రాసి 60008 60008 కు సందేశం పంపాలి.
మీరు రీఛార్జ్ చేసిన తర్వాత, మీకు ప్రయోజనాలు లభించడం ప్రారంభమవుతుంది. ట్రయల్ గురించి చెప్పాలంటే, ఇది 800+ టీవీ ఛానెల్లు, 13 OTT యాప్లు మరియు అనేక ఇతర ప్రయోజనాలతో వస్తుంది.