31 January 2025
Subhash
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయ్యాయి. ముందుగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం తర్వాత ప్రభుత్వం ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టింది.
ఫిబ్రవరి 1, 2025న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ దేశ సాధారణ బడ్జెట్ను పార్లమెంట్లోప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్లో కీలక అంశాలు ఉండనున్నాయి.
బడ్జెట్ 2025లో ఐదు ప్రధాన మార్పులు ఏమిటో తెలుసుకుందాం. ఇది మీకు ప్రయోజనం చేకూరే అంశాలు ఉండనున్నాయి. ఈ బడ్జెట్పై దేశ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
బడ్జెట్ 2025లో కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించవచ్చు. పన్ను స్లాబ్లో మార్పులు ఉండవచ్చు.
పన్ను చెల్లింపుదారులకు పన్ను రహిత ఆదాయ పరిమితిని ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
2025 బడ్జెట్ సమావేశాల సందర్భంగా పన్ను చెల్లింపుదారులకు కోసం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఇందులో వినియోగదారులకు ఐటీఆర్ ఫైల్ చేసే గడువును పెంచే అవకాశం ఉంది.
ద్రవ్యోల్బణాన్నినియంత్రించడానికి అందరికీ ఆహారం, దుస్తులు, నివాసం ఉండేలా ప్రభుత్వం యూనియన్ బడ్జెట్లో కీలక ప్రకటనలు చేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నారు. దాని పరిమితి కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి.