17 సంవత్సరాల తర్వాత BSNLలో కీలక మైలు రాయి.. రికార్డ్‌ స్థాయిలో లాభం

16  February 2025

Subhash

ప్రైవేట్ టెలికాం కంపెనీలు అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లను, ఉత్తమ నెట్‌వర్క్‌ను అందిస్తున్నందున మంచి ఆదరణ లభిస్తోంది. నష్టాల్లో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ను మూసివేస్తారని కూడా పుకార్లు వచ్చాయి. 

ప్రైవేట్ టెలికాం

గ్రామాల్లో తన నెట్‌వర్క్‌ను విస్తృతంగా విస్తరించిన బిఎస్‌ఎన్‌ఎల్.. ఇటీవల టవర్ కింద నిలబడినా ప్రజలు నెట్‌వర్క్ కవరేజ్ పొందలేని పరిస్థితిని ఉండేది. 

నెట్‌వర్క్‌

అలాగే 17 సంవత్సరాల తర్వాత ఈ త్రైమాసికంలో 262 కోట్ల రూపాయల లాభాలను గడించిందని బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ తెలిపింది. వినియోగదారులకు మరింత తగ్గరైందని తెలిపింది.

17 ఏళ్లు

నెట్‌వర్క్ విస్తరణ, ఖర్చు ఆప్టిమైజేషన్, కస్టమర్-కేంద్రీకృత సేవా మెరుగుదలలపై దృష్టి సారించిన ప్రయత్నాలే ఈ విజయానికి కారణమని బీఎస్‌ఎన్‌ఎల్‌ పేర్కొంది. 

నెట్‌వర్క్

17 ఏళ్ల తర్వాత బిఎస్ఎన్ఎల్ రూ.262 కోట్లు లాభాలను నమోదు చేసింది. ఈ లాభాలు ఒక మలుపుగా అభివర్ణించారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. బిఎస్‌ఎన్‌ఎల్ సేవలు 14-18% పెరిగాయి. 

బిఎస్ఎన్ఎల్

బీఎస్‌ఎన్‌ఎల్‌ సానుకూల వృద్ధిలో ఒక మైలురాయిని జరుపుకుంటుంది. మూడవ త్రైమాసికంలో తాము రూ,262 కోట్లలాభాన్ని సాధించామని తెలిపారు.

 బీఎస్‌ఎన్‌ఎల్‌

ఇది 2007 తర్వాత లాభాలను సాధించామని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది. ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నప్పుడు మీ నిరంతర నమ్మకం, మద్దతుకు ధన్యవాదాలు అంటూ తెలిపారు.

 బీఎస్‌ఎన్‌ఎల్‌

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దాదాపు 17 సంవత్సరాల తర్వాత లాభాలను నమోదు చేసింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.262 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. నికర లాభం ఆర్జించింది.

నికర లాభం