24 October 2023

భారతదేశాన్ని లూటీ చేసి అత్యంత ధనవంతుడిగా మారిన ఆంగ్లేయుడు ఇతనే

18 ఏళ్ల వయసులో బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చిన ఓ ఆంగ్లేయుడు రాబర్ట్ క్లైవ్.. ఈస్ట్ ఇండియా కంపెనీలో గుమాస్తాగా చేరాడు.

ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం ప్రారంభించిన తరువాత, మొఘలులతో ఇతర భారతీయ రాజులతో పోరాడి బ్రిటిష్ వారికి ప్రయోజనం చేకూర్చాడు.

భారతదేశంలో దోచుకోవడం ద్వారా బ్రిటిష్ వారితో తన ఖజానాను నింపుకున్నాడు రాబర్ట్. దీంతో ఆయనపై అవినీతి కేసు కూడా నమోదైంది.

భారతదేశం నుండి ఎన్ని వస్తువులను దోచుకుని బ్రిటిష్ ప్రభుత్వ ఖజానాను నింపారని రాబర్ట్‌‌ను విచారించినప్పుడు, షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

900 నౌకల్లో భారత్ నుంచి బంగారం, వెండి, ఖరీదైన వస్తువులను దోచుకెళ్లి బ్రిటన్ కు పంపించానని రాబర్ట్ బదులిచ్చారు.

భారతదేశంలో విభజించి పాలించు విధానాన్ని ప్రారంభించింది రాబర్ట్ క్లైవ్. ఈ ప్రక్రియను ప్రారంభించి బ్రిటీష్ వారు దీని నుండి చాలా ప్రయోజనం పొందారు. 

1767వ సంవత్సరంలో రాబర్ట్ భారతదేశాన్ని శాశ్వతంగా విడిచిపెట్టాడు. 

అతను నిర్దోషిగా విడుదలైనప్పటికీ, ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.