అంతర్జాతీయ మార్కెట్లో ఆంధ్రా ఆవు సత్తా.. ఏకంగా రూ.40 కోట్లు

TV9 Telugu

31 March 2024

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవు ధర వింటే మీరు షాక్ అవుతారు. దీని ధర హెచ్125 మోడల్ హెలికాప్టర్ కంటే ఎక్కువ.

ప్రపంచ పశువుల వేలం పాటలో రికార్డు సృష్టించిన ఆంధ్రా ఆవు ఒంగోలు జాతి ఆవు. ఎంతో తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే.

ఏకంగా రూ.40 కోట్లకు అమ్ముడు పోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూర్‌కు చెందిన వయాటినా-19 ఎఫ్‌ఐవి మారా ఇమోవీస్ బ్రీడ్‌ ఆవు.

ఇప్పటి వరకు అంతర్జాతీయ పశువులు మార్కెట్లో విక్రయించిన అత్యంత ఖరీదైన ఆవుగా చరిత్ర సృష్టించిన ఒంగోలు ఆవు.

బ్రెలిల్‌లో నిర్వహించిన పశువుల వేలంలో 4.8 మిలియన్‌ డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ.40 కోట్లు)కు నెల్లూరు ఆవు అమ్మకం.

నెల్లూరు జాతి ఆవులు అత్యంత వేడి ఉష్ణోగ్రతలలో కూడా వృద్ధి చెందగల సామర్థ్యం, సమర్థవంతమైన జీవక్రియ, పరాన్నజీవి ఇన్‌ఫెక్షన్‌లను తట్టుకుంటాయి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా పేరు కలిగిన ఈ జాతి పశువులను శాస్త్రీయంగా బోస్‌ ఇండికస్‌గా పిలుస్తారు.

1868లో బ్రెజిల్‌కు మొదటి సారిగా జంట ఒంగోలు పశువులను తీసుకెళ్లారు. దీంతో అక్కడ ఈ జాతి పశువుల విస్తరణ ప్రారంభం.