8600 ఏళ్ల నాటి వండకుండా వదిలేసిన రొట్టె లభ్యం ఎక్కడంటే.. 

11 March 2024

TV9 Telugu

Pic credit - Pexels

టర్కీలోని పురావస్తు శాస్త్రవేత్తలు నమ్మలేని ఒక ఆవిష్కరణను చేశారు. 8,600 ఏళ్ల క్రితం వండకుండా వదిలేసిన రొట్టె తవ్వకాల్లో బయల్పడింది. 

అద్భుతమైన ఆవిష్కరణ 

దక్షిణ టర్కీలోని కొన్యా ప్రావిన్స్‌లోని పురావస్తు ప్రదేశం కాటల్‌హోయుక్ ప్రాంతంలో ప్రపంచంలోని పురాతన రొట్టె కనుగొనబడింది.

ప్రపంచంలోనే పురాతన బ్రెడ్

పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం  ఈ రొట్టె 8600 సంవత్సరాల పురాతనమైనది. ఇది మట్టి ఇటుకలతో చేసిన ఇంట్లో కనుగొనబడింది.

8600 సంవత్సరాల నాటిది

మెకాన్ 66 అనే ప్రాంతంలో దొరికిన విరిగిన ఓవెన్‌లో పచ్చిగా ఉన్న ఈ రొట్టె అవశేషాలు పురావస్తు  శాస్త్రవేత్తలకు కనిపించాయి.

పగిలిన ఓవెన్‌లో అవశేషాలు

ఈ రొట్టె గుండ్రని ఆకారంలో పూర్తిగా పులియబెట్టి ఉంది. దీనిలో వాడిన పిండి పదార్ధం ఇప్పటికీ  మనుగడలో ఉంది. దీని కారణంగా ఈ రొట్టె సంవత్సరం నిర్ణయించబడింది.

పూర్తిగా పులిసిపోయింది

ధాన్యం అవశేషాలు లభ్యం కావడంతో ఇది టర్కీకి మాత్రమే కాదు ప్రపంచానికి ఉత్తేజకరమైన ఆవిష్కరణ అని టర్కిష్ జీవశాస్త్రవేత్త సలీహ్ కవాక్ అన్నారు.

ధాన్యం అవశేషాలు