20 June 2024
TV9 Telugu
Pic credit - getty
మధ్యప్రదేశ్లోని దామోహ్లో ఓ ప్రత్యేకమైన ఆవు కనిపించింది. దూడకు జన్మనివ్వకుండానే రోజూ 14 లీటర్ల పాలు ఇస్తోంది. ఈ వార్త గ్రామంలో వ్యాపించడంతో ఆవును చూడటానికి ప్రజలు క్యూ కట్టారు.
దూడకు ఆవు జన్మనివ్వలేదు. అయితే అప్పుడు ఆ ఆవు పాలు ఎలా ఇస్తోందని ఆలోచిస్తున్నారు. ఈ ఆవును చూసేందుకు అనేక వెటర్నరీ డాక్టర్ల బృందాలు కూడా రావడం ప్రారంభించాయి.
ఇంతలో ఒక పశువైద్యుడు ముందుగా ఆవు గర్భాశయంలో ఒక గడ్డ ఉందని.. దీంతో దూడకు జన్మ ఇచ్చే సామర్ధ్యం లేదని చెప్పాడు. చికిత్స కూడా చేశాడు.
చికిత్సతో గడ్డ నయమైంది. అయితే చికిత్స తర్వాత ఆవులో హార్మోన్ల మార్పు మొదలైంది. దీంతో ఆవు పాలు ఇవ్వడం ప్రారంభించింది.
దూడల పోషణకు క్షీరదాల్లో సహజంగా పాలు ఉత్పత్తి అవుతాయని తెలిపారు. అయితే ఇలా దూడకు జన్మనివ్వకుండా పాలు ఇవ్వడం అనేది చాలా అరుదు అని చెప్పారు
ఈ జెర్సీ ఆవును రెండేళ్ల క్రితం జబల్పూర్ నుంచి కొనుగోలు చేసినట్లు ఆవు యజమాని దేవేంద్ర లోధి తెలిపారు.
చికిత్స చేసిన అనంతరం వైద్యులు ఆవుకు మందు ఇచ్చారు. మందు ఇచ్చిన ఒక వారం తర్వాత ఆవు పొదుగు పాలు పుట్టడం ప్రారంభించింది. ఇప్పుడు ఈ ఆవు రోజుకు మొత్తం 14 లీటర్ల పాలు ఇస్తుంది.