భారతదేశంలో అరుదైన మ్యూజియంలు.. ఒకసారైనా చూడాలి..

22 August 2023

భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిలయం. ఇక్కడ ఎన్నో ఆధ్యాత్మిక, ప్రకృతి, ఇతర పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

దేశంలో ఎన్నో ప్రసిద్ధ మ్యూజియంలు పర్యాటక నిలయంగా ఉన్నాయి.  కొన్ని అసాధారణమైన, చమత్కారమైన మ్యూజియంలు ఉన్నాయి.

భారతదేశంలో కొన్ని మ్యూజియంలు చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పుడు ఆ మ్యూజియంలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మ్యూజియంలో సాంప్రదాయ భారతీయ గాలిపటాలు, చైనీస్ గాలిపటాలు, జపనీస్ గాలిపటాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ గాలిపటాలు ఉన్నాయి.

కైట్ మ్యూజియం, అహ్మదాబాద్

ఈ మ్యూజియం టాయిలెట్స్, శానిటేషన్ చరిత్రతో వ్యవహరిస్తుంది. ఇది పురాతన కాలం నుండి ఆధునిక యుగం వరకు మరుగుదొడ్లు ఎలా అభివృద్ధి చెందాయో చూడొచ్చు.

సులభ్ ఇంటర్నేషనల్ మ్యూజియం ఆఫ్ టాయిలెట్స్, న్యూఢిల్లీ

బెంగుళూరులోని ఈ ప్రత్యేకమైన మ్యూజియం మెదడు, దాని పనితీరును అధ్యయనం చేస్తుంది.

నిమ్హాన్స్ బ్రెయిన్ మ్యూజియం, బెంగళూరు

ఈ మ్యూజియంలో వివిధ దేశాలు, సంస్కృతులకు చెందిన బొమ్మల సేకరణ ఉంటుంది. ఇందులో  85 దేశాల  7,000 కంటే ఎక్కువ బొమ్మలు ఇందులో ఉన్నాయి.

ఇంటర్నేషనల్ డాల్స్ మ్యూజియం, న్యూఢిల్లీ

ఈ మ్యూజియం మాయాంగ్ మంత్రవిద్య, వశీకరణ చరిత్రకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి ఒక మ్యూజియం నిర్మించబడింది.

బ్లాక్ మ్యాజిక్, విచ్ క్రాఫ్ట్ మ్యూజియం, మయోంగ్