భారతదేశంలో కుటుంబంతో కలిసి చూడదగిన ప్రదేశాలు..

17 August 2023

మీరు కుటుంబంతో పర్యటనకు వెళితే ఇండియాలో ఈ 5 ప్రదేశాలను అస్సలు మిస్ కావొద్దు. ఎందుకంటే ఈ ప్రదేశాలు మీకు సరికొత్త అనుభూతిని ప్రసాదిస్తాయి.

అంతేకాదు వీటిని సందర్శించిన తర్వాత మీలో కచ్చితంగా మార్పు కనిపిస్తుంది. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

మీరు తాజ్‌ మహల్ చూస్తే చాలా అనుభూతికి లోనవుతారు. ప్రేమకు చిహ్నం తాజ్‌ మహల్. మీరు ఇండియాలో ఉండి తాజ్‌మహల్‌ని అస్సలు మిస్ కావొద్దు.

తాజ్ మహల్

వారణాసి ఒక ప్రాచీన నగరం. ఇక్కడ పవిత్ర గంగా నది ప్రవహిస్తుంది. అధ్యాత్మికతకు నెలవు వారణాసి. ఇక్కడి వాతావరణం మిమ్మల్ని పునరాలోచించేలా చేస్తుంది.

వారణాసి

బోధ్‌గయలో బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందాడు. ఇది బీహార్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ మహాబోధి ఆలయ సముదాయంలో బుద్ధ భగవానుడు జ్ఞానోదయం చెట్టు అలాగే ఉంది.

బోధ్‌గయ

జైపూర్ పింక్‌ సిటీగా గుర్తింపు సాధించింది. ఇక్కడి కోటలను చూస్తే మీరు మాయాలోకానికి వెళ్లినట్లుగా అనిపిస్తుంది. ప్రతి కట్టడానికి ఒక చరిత్ర ఉంటుంది.

జైపూర్

హిమాచల్ ప్రదేశ్‌లో చాలా ప్రదేశాలు అద్భుతంగా ఉంటాయి. సిమ్లా, ధర్మశాల, కుఫ్రి, కసోల్‌, డల్హౌసీ మొదలైన ప్రదేశాలు ఉంటాయి. ఇక్కడ దొరికే యాపిల్స్‌ చాలా ప్రత్యేకమైనవి.

హిమాచల్ ప్రదేశ్

పశ్చిమ కనుమలు ఆరు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రదేశం ట్రెక్కింగ్‌కి పెట్టింది పేరు. విశ్రాంతి తీసుకోవడానికి, ప్రశాంతంగా ఉండటానికి ఈ ప్రదేశం అనుకూలమైనది.

పశ్చిమ కనుమలు