రైల్లో పాములు విడిచిపెట్టిన బిచ్చగాళ్లు..!

11 September 2023

యూపీలో కొందరు బిచ్చగాళ్లు బరితెగించారు. ప్రయాణీకులు డబ్బులు ఇవ్వలేదని వారు ప్రయాణిస్తున్న రైల్లో తమ దగ్గరున్న పాములు విడిచిపెట్టారు.

చంబల్ ఎక్స్‌ప్రెస్ రైలు హావ్‌డా నుంచి గ్వాలియర్‌కు యూపీ మీదుగా వెళ్తుండగా నలుగురు బిచ్చగాళ్లు ఈ దారుణానికి ఒడిగట్టారు.

తమ దగ్గురున్న బుట్టల్లోని పాములను బయటకు తీసిన బిచ్చగాళ్లు బిచ్చం కోసం వాటిని ప్రయాణీకుల కోచ్‌లో ఆడించారు.

కొందరు ప్రయాణికులు భయంతో పక్క కోచ్‌లకు పరుగులు పెట్టగా.. మరికొందరు ప్రాణభయంతో పై బెర్తుల పైకి ఎక్కారు.

మరికొందరు ప్రయాణికులు అయితే భయంతో కోచ్‌లోని టాయ్‌లెట్ల లోపాలకి దూరి.. లోపలి నుంచి గడియపెట్టుకున్నారు.

దాదాపు అరగంట పాటు ఈ ట్రైన్ కోచ్‌లో బిచ్చగాళ్ల బుట్టల్లో నుంచి వదిలిన పాములు కారణంగా భయానక వాతావరణం నెలకొంది.

కొందరు ప్రయాణీకులు తమ ఫోన్లతో మహోబా రైల్వే పోలీసులకు కాల్ చేసి జరిగిన ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేశారు.

విషయం తెలుసుకున్న బిచ్చగాళ్లు కోచ్‌లో తాము విడిచిపెట్టిన పాములను తిరిగి బుట్టల్లో వేసుకుని స్టేషన్ రాకముందే దిగి పారిపోయారు.