బస్సు లేదా రైలులో ప్రయాణించేటప్పుడు వాంతులు అవుతున్నాయా.?

02 AUGUST 2023

కొంతమంది బస్సులో కానీ రైలులో కానీ ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కసారిగా వాంతులు చేసుకుంటారు.

ముఖ్యంగా ఈ సమస్య పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. జర్నీలో ఎదురయ్యే కొన్ని వాసనలు, గాలి వల్ల చాలా ఇబ్బందివడుతారు.

దీంతో తల తిరగడం, వాంతులు చేసుకోవడం జరుగుతుంది. ఈ పరిస్థితిని మోషన్‌ సిక్‌నెస్‌ అంటారు.

ముందుగా ప్రయాణ సమయంలో అవసరమైన మందులను దగ్గర ఉంచుకోవాలి.

గ్యాస్‌, అసిడిటీ సమస్యలు ఉంటే డాక్టర్‌ సలహాలు పాటించాలి. సుదీర్ష ప్రయాణానికి వెళ్లవలసి వచ్చినవ్వుడు టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. 

ఎందుకంటే ఇని జీర్ణక్రియ ప్రక్రియను పాడుచేసి కడువులో గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయి. అందుకే ఇవి తాగకూడదు.

అలాగే ప్రయాణం చేసేటప్పుడు పొరపాటున కూడా భాళీ కడుపుతో ఉండకూడదు. సులభంగా జీర్ణమయ్యే కొన్ని ఆహారాలని తీసుకోవాలి.

దీని వల్ల ఎలాంటి కడువు నొప్పి ఉండదు. ప్రయాణంలో తరచుగా వాంతులు చేసుకుంటే నోటిలో యాలకులు పెట్టుకోవాలి.

ఇవి వికారం సమస్యని తొలగిస్తుంది.  ప్రయాణంలో ఖాళీ కడుపుతో గోరువెచ్చని పాలు తాగకూడదు. దారిలో శరీరానికి నీటి కొరత రానివ్వద్దు.

వండ్ల రసాలను తాగుతూ ఉండాలి. ప్రయాణంలో నిమ్మ, నారింజ, వంటి సిట్రస్‌ వండ్లను తింటూ ఉండాలి.

అరగ్లాసు నీటిలో ఒక చెంచా యాపిల్‌ వెనిగర్‌ మిక్స్‌ చేసి ఉదయాన్నే వరగడువున తాగితే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.