సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన కృతిసనన్ 

28 August 2023

Pic Credit - Instagram

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది బాలీవుడ్ భామ కృతిసనన్.

ఆతర్వాత నాగ చైతన్యతో కలిసి దోచెయ్ అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.

దాంతో తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ రాణిస్తుంది. రీసెంట్ గా ప్రభాస్ తో కలిసి నటించిన ఆదిపురుష్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది

ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ బాలీవుడ్ లో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా బిజీగా గడిపేస్తుంది.

అక్ష‌య్ కుమార్‌, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తుంది కృతిసనన్. అయితే తెలుగులో సరైనా అవకాశాలు మాత్రం రావడం లేదు

ప్రస్తుతం ఈమె ‘హౌస్‌ఫుల్ 5’ సినిమాలో యాక్ట్ చేస్తోంది. అలాగే ‘మిమీ’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది కృతిసనన్

ఈ సినిమాలో సరోగేట్‌ మదర్‌గా నటించడానికి ఏకంగా 15 కిలోలు బరువు పెరిగింది. అంతే కాదు తన నటనతో అందరిని ఆకట్టుకుంది.

తాజాగా ఈ సినిమాకు గాను కృతి సనన్ కు జాతీయ అవార్డు లభించింది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.