పూజాకు ఏమైంది ?.. మరో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న బుట్టబొమ్మ..

16 August 2023

Pic credit - Instagram

గత కొంతకాలంగా వరుసగా డిజాస్టర్స్ ఖాతాలో వేసుకుంటుంది పూజా హెగ్డే. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. 

కానీ సౌత్ టూ నార్త్ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ మాత్రం ఈ అమ్మడుకు క్యూకడుతున్నాయి. తెలుగులో చివరిసారిగా రాధేశ్యామ్ సినిమా చేసింది. 

అయితే ఇప్పుడు పూజాకు బ్యాడ్ టైమ్ నడుస్తుందనే చెప్పుకొవాలి. ఇటీవలే గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకుంది. 

మహేష్ సినిమా నుంచి పూజా తప్పుకోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ఆమె స్థానంలోకి మీనాక్షిని తీసుకున్నారు. 

ఇప్పుడు మరో టాలీవుడ్ హీరో సినిమా నుంచి పూజా తప్పుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. కారణాలు తెలియరాలేదు. 

మాస్ మాహారాజా రవితేజ, పూజా కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉంది. తాజాగ ఈ మూవీ నుంచి తప్పుకుందట పూజా.

ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నారు. పారితోషికం, డేట్స్ కారణంగా తప్పుకున్నట్లు టాక్. 

ఇక ఇప్పుడు యంగ్ హీరోయిన్స్ దాటికి  సీనియర హీరోయిన్స్ హావా మాత్రం తగ్గిందనే చెప్పుకోవాలి. అందులో పూజా పేరు మొదట.