షర్మిలకు అరుదైన గుర్తింపు..

15 August 2023

దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైయస్ షర్మిల తెలంగాణలో YSR తెలంగాణ పార్టీ ప్రారంభించిన విషయం తెలిసిందే.

ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తూ తెలంగాణలో పాదయాత్ర కూడా చేపట్టారు వైయస్ షర్మిల. ఈ మధ్య నిత్యం వార్తల్లో కనిపిస్తున్నారు.

YSR తెలంగాణ పార్టీ అధినేత్రిగా తెలంగాణలో 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసినందుకు ఈ  రికార్డ్ క్రియేట్ చేశారు ఆమె.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె చేసిన పాదయత్రకు గానూ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు.

ఈ మేరకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వైయస్ షర్మిల గారిని కలిసి అభినందించి అవార్డును ప్రదానం చేశారు.

తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కృషి చేస్తూ ముందుకు వెళ్తు వార్తల్లో హాట్ టాపిక్ అవుతున్నారు ఆమె.

వైయస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకురావడమే తన లక్ష్యం అంటూ వరుస సభలు పెడుతూ ప్రజల్లో గడుపుతున్నారు.

ఆ సభల్లో ప్రజల సమస్యలు తెలుసుకొంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు వైయస్ షర్మిల.