మహిళా ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ అలర్ట్‌.. ఉచిత ప్రయాణానికి ఆ కార్డు చెల్లదు

TV9 Telugu

09 January 2024

మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి టికెట్‌ తీసుకోవాలి.

కొంత మంది స్మార్ట్‌ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్‌ జిరాక్స్ లు చూపిస్తున్నారు. దీనివల్ల సిబ్బంది ఇబ్బందికి గురవుతున్నారు.

ఒరిజనల్‌ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్‌ ను తీసుకోవాలి. ఎలాగూ ఉచితమే కదా. జీరో టికెట్‌ తీసుకోవడం ఎందుకు అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారు.

జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును TSRTC కి ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుంది. జీరో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తే.. సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారు.

కావున తెలంగాణాలో ఉన్న ప్రతి మహిళా కూడా జీరో టికెట్‌ను తీసుకోవాలని చెబుతున్నారు టీఎస్‌ఆర్టీసీ అధికారులు.

ఒక వేళ టికెట్‌ తీసుకోకుండా ప్రయాణిస్తూ చెకింగ్ లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని తెలిపింది టీఎస్‌ఆర్టీసీ.

అలాగే టికెట్‌ తీసుకోకుండా ప్రయాణిస్తున్న సదరు వ్యక్తికి రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుందని వెల్లడించిన సంస్థ.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్‌ తీసుకుని సహకరించాలని కోరుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు.