10 December 2023

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్ రెడ్డి.

బాత్రూమ్‌లో జారిపడటంతో తుంటి ఎముక విరిగి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను పరామర్శించారు.

ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్‌  సీఎంను పరామర్శించారు.

కేసీఆర్‌ను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో సీఎం వెంట మంత్రులు సీతక్క, షబ్బీర్‌ అలీ కూడా ఉన్నారు.

కేసీఆర్‌ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలన్నారు సీఎం రేవంత్. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై కేసీఆర్‌ మాట్లాడాలని అభిప్రాయపడ్డారు.

ఆయన సూచనలు, సలహాలు ప్రభుత్వానికి అవసరమన్నారు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం కేసీఆర్‌ కోలుకుంటున్నారు.

ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది. వైద్యులు వాకర్‌ సాయంతో ఆయనను నడిపిస్తున్నారు.

కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని.. చాలా వేగంగానే రికవరీ అవుతున్నారని అన్నారు డాక్టర్లు.