05 September 2023

నాన్ వెజ్ ప్రియులకు పండగే పండగ..

నాన్ వెజ్ ప్రియులకు పండగలాంటి వార్త ఇది.. తెలంగాణ గవర్నమెంట్ శుభవార్త చెప్పింది.

రాష్ట్ర వ్యాప్తంగా మటన్ క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

ముందుగా హైదరాబాద్‌లో తొలి మటన్ క్యాంటీన్‌ను ఈ నెల 12న లాంఛ్ చేయనున్నారు.

మాసబ్ ట్యాంక్ వద్ద శాంతినగర్‌లో తెలంగాణ ప్రభుత్వ గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య దీన్ని ఏర్పాటు చేయనుంది.

మటన్ బిర్యానీతో పాటు పాయా, కైమా తదితర వంటకాలను ఇందులో విక్రయిస్తారు. ధరలు కూడా తెరలోనే తెలుపుతారు.

బయట హోటల్స్‌తో పోల్చితే తక్కువ ధరకే ఇక్కడ రుచికరమైన మటన్ ఐటమ్స్‌ లభిస్తాయి అని ప్రభుత్వం తెలిపింది.

హైదరాబాద్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మటన్ క్యాంటీన్లను ప్రారంభించనున్నారు.

దీనితో పాటు త్వరలోనే మొబైల్ క్యాంటీన్లను కూడా నిర్వహించే యోచనలో ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఉంది.