గూగుల్ పిక్సెల్ వాచ్‌ వచ్చేస్తోంది. ధరెంతో తెలుసా? 

10 September 2023

గూగుల్‌ పిక్సెల్‌ వాచ్‌2ను గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

వచ్చే నెలలో మేడ్‌ బై గూగుల్ అనే కార్యక్రమంలో ఈ వాచ్‌ను లాంచ్‌ చేయనున్నారు. 5వ తేదీ నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. 

ఈ విషయాన్ని గూగుల్ ఇండియా శనివారం అధికారికంగా ప్రకటించింది. అన్ని ఈ కామర్స్‌ సైట్స్‌లో అందుబాటులోకి రానుంది.

ఇక ఈ స్మార్ట్ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో క్వాల్‌కామ్‌ స్నాప్‌ డ్రాగన్‌ వీ5 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. 

ఈ వాచ్‌ను ఒక్కసారిగా చార్జ్‌ చేస్తే ఏకంగా 24 గంటలకుపైగా నాన్‌ స్టాప్‌గా పనిచేస్తుంది. 

వేర్‌ ఓఎస్‌4 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్ వాచ్‌లో ఆల్ వేస్ ఆన్ డిస్ ప్లే (ఏఓడీ) ఫీచర్ యాక్టివ్ గా ఉంటుంది. 

ఇక పిక్సెల్‌ వాచ్‌ 2 నాలుగు ఫ్రెష్ వాచ్ ఫేసెస్‌తో యాసెసిబుల్, ఆర్క్, బోల్డ్ డిజిటల్, అనలాగ్ బోల్డ్‌తో రానుందని సమాచారం.

ధరకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ. రూ. 35 వేల వరకు ఉండొచ్చని అంచనా.