గూగుల్ పిక్సెల్ వాచ్ వచ్చేస్తోంది. ధరెం
తో తెలుసా?
10 September 20
23
గూగుల్ పిక్సెల్ వాచ్2ను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
వచ్చే నెలలో మేడ్ బై గూగుల్ అనే కార్యక్రమంలో ఈ వాచ్ను లాంచ్ చేయనున్నారు. 5వ తేదీ నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.
ఈ విషయాన్ని గూగుల్ ఇండియా శనివారం అధికారికంగా ప్రకటించింది. అన్ని ఈ కామర్స్ సైట్స్లో అందుబాటులోకి రానుంది.
ఇక ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ వీ5 చిప్సెట్ ప్రాసెసర్ను అందించారు.
ఈ వాచ్ను ఒక్కసారిగా చార్జ్ చేస్తే ఏకంగా 24 గంటలకుపైగా నాన్ స్టాప్గా పనిచేస్తుంది.
వేర్ ఓఎస్4 ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే ఈ స్మార్ట్ వాచ్లో ఆల్ వేస్ ఆన్ డిస్ ప్లే (ఏఓడీ) ఫీచర్ యాక్టివ్ గా ఉంటుంది.
ఇక పిక్సెల్ వాచ్ 2 నాలుగు ఫ్రెష్ వాచ్ ఫేసెస్తో యాసెసిబుల్, ఆర్క్, బోల్డ్ డిజిటల్, అనలాగ్ బోల్డ్తో రానుందని సమాచారం.
ధరకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ. రూ. 35 వేల వరకు ఉండొచ్చని అంచనా.
ఇక్కడ క్లిక్ చేయండి..