అంబటి రాయుడు యూటర్న్.. మళ్లీ బ్యాట్ పట్టనున్న ఆంధ్ర క్రికెటర్..

12 August 2023

క్రికెట్ కెరీర్‌కు ఇటీవల గుడ్ బై చెప్పిన క్రికెటర్ అంబటి రాయుడు తన తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకున్నారు.

మళ్లీ బ్యాట్‌ పట్టి గ్రౌండ్ లో ఆడి తన అభిమానులను అలరించాలని ఈ ఆంధ్ర క్రికెటర్ నిర్ణయం  తీసుకున్నాడు.

కరీబియన్ ప్రిమియర్ లీగ్ (CPL)లో ఈ సీఎస్కే మాజీ ఆటగాడు బరిలో దిగి మరోసారి తన సత్తా చూపించనున్నారు రాయుడు.

ఆ మేరకు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుతో క్రికెటర్ అంబటి రాయుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

క్రికెటర్ ప్రవీణ్ తంబె తర్వాత సీపీఎల్‌లో ఆడనున్న రెండో భారత క్రికెట్ ఆటగాడు అంబటి రాయుడు కావడం విశేషం.

కరీబియన్ ప్రిమియర్ లీగ్ (CPL) టోర్నీలో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టు కట్టడంపై రాయుడు సంతోషం వ్యక్తంచేశాడు.

కరీబియన్ ప్రిమియర్ లీగ్ (CPL) -2023 సీజన్ ఈ నెల(ఆగస్టు 16) నుంచి ఘనంగా ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.

అయితే బీసీసీఐ కొత్త నిబంధనల మేరకు ఈ భారత క్రికెట్ ఆటగాడు సీపీఎల్‌లో ఆడేందుకు ఆటంకం కలిగే అవకాశముంది.