'హైదరాబాద్ టూ తిరుమల' నయా టూర్ ప్యాకేజ్.. 

24 September 2024

TV9 Telugu 

తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకొనేందుకు తెలంగాణ టూరిజం వారు 'తిరుమల టూర్​- తెలంగాణ టూరిజం' పేరుతో డైలీ టూర్​ ఆపరేట్​ చేస్తున్నారు.

హైదరాబాద్​ నుంచి మొదలై రెండు రాత్రులు, ఒక పగలు ఉండే ఈ టూర్​  ప్యాకేజీ బుక్ చేసుకున్న వారు ఉచితంగా శ్రీవారి శీఘ్రదర్శనం చేసుకోవచ్చు.

అంతేకాదు.. టూర్​లో భాగంగా తిరుచానూర్ పద్మావతి అమ్మవారి దర్శనం కూడా ఉంటుందని తెలంగాణ టూరిజం పేర్కొంది.

తెలంగాణ టూరిజం బస్సులో సాగె ఈ టూర్​ ప్యాకేజీలో పెద్దలకు రూ.3,800, పిల్లలకు రూ.3,040 ఛార్జ్ చేస్తున్నారు.

ఈ టూర్ ప్యాకేజీ కోసం హైదరాబాద్‎లో కేపీహెచ్​బీ, సికింద్రాబాద్​, ​బేగంపేట్​, బషీర్ బాగ్ పికప్ పాయింట్స్ ఉన్నాయి.

హైదరాబాద్‎లో మొదటిరోజు సాయంత్రం 5 గంటలకు బస్సులో మొదలైన మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరుపతి చేరుకుంటారు.

ముందుగా అక్కడ స్థానిక ఆలయాలను దర్శించుకొని తిరుమల కొండపైకి శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.

సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి రిటర్న్ బయలుదేరి ఉదయం 7 గంటలకు హైదరాబాద్​ చేరుకోవడంతో టూర్​ ముగుస్తుంది.

ఈ టూర్ కోసం​ 7 రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకోవాలి. టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎలాంటి రిఫండ్ ఉండదని తెలంగాణ టూరిజం వెల్లడించింది.