రోజుకు ఐదు సార్లు రంగులు మారే శివలింగం.. అబ్బా మహా అద్భుతం
Phani CH
23 Jul 2025
Credit: Instagram
మన దేశం లో 12 జ్యోతిర్లింగ ఆలయాలతో పాటు వివిధ ప్రాంతాలలో అద్భుత శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఇలాంటి వాటి లో కళ్యాణసుందరేశ్వర
ఆలయం ఒకటి.
ఇది తమిళనాడులోని కుంభకోణంలో ఉంది. ఈ దేవాలయానికి సంబంధించిన అనేక అద్భుతమైన కథలు వాడుకలో ఉన్నాయి.
ఈ ఆలయం శివుడు నివాసం అని నమ్ముతారు ప్రజలు. అంతేకాదు ఈ ఆలయం ప్రత్యేకమైన శిల్పాలు, శిల్పకళకు ప్రసిద్ధి చెందింది.
ఈ ఆలయం శివుడిని కళ్యాణసుందరేశ్వర స్వామిగా మరియు పార్వతిని కళ్యాణి అమ్మన్గా పూజిస్తుంది. ఇక్కడ శివలింగం స్వయంభు వెలసినది.
ఈ ఆలయం యొక్క స్వయంభూ శివలింగంప్రత్యేకత ఏంటంటే ఇది రోజుకు ఐదుసార్లు రంగులు మారుతుందని భక్తులు నమ్ముతారు.
ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 3 గంటలకు, రాత్రి 8 గంటలకు మరియు అర్ధరాత్రి 12 గంటలకు రంగులు మారుతుందని భక్తులు చెబుతున్నారు.
సాధారణంగా, శివలింగం తెల్లగా, బంగారు వర్ణంలో, ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలం రంగులలో మారుతుందని చెబుతారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆ స్టార్ హీరో ఇచ్చిన 500 భద్రంగా దాచుకున్నా.. ప్రియమణి
అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు.. అమ్మాడికి కలిసిరాని అదృష్టం..
కాశ్మీరీ అందంలా స్రవంతి.. అట్టా చూస్తే కుర్రాళ్ల మతిపోయేనే..