భారత్‎లోని అత్యంత అందమైన దేవాలయాలు ఇవే..

TV9 Telugu

07 August 2024

ఎన్నో లక్షలాది సంవత్సరాలుగా సనాతన హిందూ ధర్మంతో విలసిల్లుతున్న భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయని తెలిసిందే.

వీటన్నింటినీ తనివితీరా చూడాలంటే ఒక జీవితం సరిపోదేమో అంటే అతిశయోక్తి కానేకాదు. అన్ని దేవాలయాలు ఉన్నాయి.

ఈ క్రమంలో మన దేశంలోని కొన్ని భక్తులతో కలకలలాడే అందమైన దేవాలయాల గురించి ఇఫ్పుడు తెలుసుకుందాం..

కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో నిర్మాణ సమూహాలలో ఒక భాగం విరూపాక్ష దేవాలయం. ఇది యునెస్కోచే ఎంపిక కాబడింది.

మధ్యప్రదేశ్‌లోని ఖజురహో దేవాలయాలు వాటి అందాలకు ప్రపంచ ప్రసిద్ధి. ఈ దేవాలయాలు 900 సా.శ నుంచి 1130 సా.శ మధ్య నిర్మించబడ్డాయి.

తమిళనాడులోని షోర్ లో అనేక దేవాలయాలు ఉన్నాయి. 8వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ దేవాలయ సమూహం నుంచి బంగాళాఖాతాం అందాలను చూడవచ్చు.

తమిళనాడులోని మదురై రంగురంగుల దేవాలయంలోని మీనాక్షి అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు.

కేదార్‌నాథ్‌ శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. మంచుతో కప్పబడిన హిమాలయాలలోని అందమైన పర్వతాలను చూడటం ఒక భిన్నమైన అనుభూతి.