రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడంలో అర్ధం ఏమిటి.?

02 AUGUST 2023

హిందూ మతంలో తులసి, వేప, మర్రి, రావి చెట్లకి చాలా ప్రాధాన్యత ఉంటుంది.

ముఖ్యంగా ఆలయాల్లో రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం, దీపాలు వెలిగించడం చాలామంది చూసే ఉంటారు.

ఇలా ఎందుకు చేస్తారంటే రావిచెట్టులో లక్ష్మిదేవి నివసిస్తుందని మత విశ్వాసం. ఈ చెట్టుని పూజించడం వల్ల జీవితంలో ధనప్రాప్తి, ఆనందం కలుగుతుందని నమ్మకం.

రావిచెట్టుకి మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు శాస్త్రీయ కోణం కూడా దాగి ఉంది.

హిందూ మతం ప్రకారం ఒక వ్యక్తి ఆరోగ్యం బాగోలేకపోతే రావి చెట్టు చుట్టూ 108 ప్రదరక్షిణలు చేయడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం.

హిందూ మతం ప్రకారం రావి చెట్టుని దేవతల నివాసంగా చెబుతారు. ఇందులో శని దేవుడు కూడా ఉంటాడు.

అలాగే జాతకంలో ఉన్న శనిదోషం పోవాలంటే అమావాస్య వచ్చే శనివారం రోజు రావి చెట్టుకు ఏడు ప్రదక్షిణలు చేయాలని నియమం ఉంది.

ఆవునూనెతో దీపం వెలిగించడం శుభప్రదమని చెబుతారు. రావిచెట్టు మానసిక ప్రశాంతతని అందిస్తుందని పెద్దల నమ్మకం.

బ్రహ్మ ముహూర్తంలో రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చెడు ఆలోచనలు మనస్సులోకి రావు.

మరోవైపు రావి చెట్టుకు ప్రతిరోజూ ప్రదక్షిణ చేస్తే ఆర్థిక సంక్షోభం నుంచి 'విమక్తి లభిస్తుందని చెబుతారు.