మరణించిన వారి ఫోటో ఆ దిశలో ఉంటేనే శుభప్రదం.. లేదంటే.. ఇంట్లో సమస్యలు..
Prudvi Battula
Images: Pinterest
20 November 2025
చనిపోయిన వ్యక్తి చిత్రపటాన్ని ఇంట్లో ఎక్కడ ఉంచాలి అనే ప్రశ్న తరచుగా చాలామంది ప్రజల మనస్సులో తలెత్తుతుంది.
చనిపోయిన వ్యక్తి ఫోటో
వాస్తు శాస్త్రం ప్రకారం, చనిపోయిన వ్యక్తి (పూర్వీకులు) ఫోటోను ఇంటి ఉత్తర గోడపై దక్షిణం వైపు చూస్తూ ఉంచాలి.
ఆ దిశలో ఉంచండి
దక్షిణ దిశను పూర్వీకులు, యమరాజు దిశగా పరిగణిస్తారు. కాబట్టి మరణించిన వ్యక్తి చిత్రపటాన్ని ఉత్తర గోడపై ఉంచడం శుభప్రదం.
యమరాజు దిశ
చనిపోయిన వ్యక్తి ఫోటోను బెడ్ రూమ్, వంటగది లేదా పూజ గదిలో ఉంచవద్దు. దానిని జీవించి ఉన్న వ్యక్తి ఫోటోతో పాటు ఎప్పుడూ ఉంచవద్దు.
అక్కడ ఉంచవద్దు
మరణించిన తల్లిదండ్రుల చిత్రపటాన్ని గాలిలో వేలాడుతున్నట్లుగా కనిపించే ప్రదేశంలో ఉంచకూడదు. ప్రార్థనా స్థలంలో లేదా జీవించి ఉన్న వ్యక్తులతో ఉంచకూడదు.
ఆ ప్రదేశంలో ఉండకూడదు
మరణించిన వ్యక్తి ఫోటోను లివింగ్ రూమ్, దక్షిణ లేదా నైరుతి గోడపై ఉంచవచ్చు. పూర్వీకుల ఫోటోను భూమి నుండి దాదాపు 6 అడుగుల ఎత్తులో ఉంచాలి.
6 అడుగుల ఎత్తులో ఉంచాలి
చనిపోయిన వ్యక్తి ఫోటోలను అతిథులు చూసే ప్రదేశంలో ఉంచకూడదు. పూర్వీకుల ఫోటోలను వేలాడదీయడానికి బదులుగా చెక్క స్టాండ్పై ఉంచడం కూడా మంచిదంటున్నారు వాస్తు నిపుణులు.
చెక్క స్టాండ్పై ఉంచండి
ఇలా చేస్తే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలగడం మాత్రమే కాదు. మీ కుటుంబనికి కూడా మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు.