ఆధ్యాత్మిక అద్భుతం అయోధ్య రామ మందిరం.. ఆసక్తికరమైన విషయాలు 

20 January 2024

TV9 Telugu

15 తరాలకు పైగా ఆలయ నిర్మాణ వారసత్వాన్ని కలిగి ఉన్న సోంపురా కుటుంబ సభ్యులు ఈ ఆలయాన్ని రూపొందించారు. ఆలయ ప్రధాన వాస్తుశిల్పి చంద్రకాంత్ బి. సోంపురా

సోంపురా కుటుంబం

2వేల ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా నాణ్యమైన వస్తువులతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయాన్ని ఇనుము లేదా ఉక్కు ఉపయోగించకుండా కేవలం రాళ్లు, రాగి, తెల్ల సిమెంట్, కలపతో నిర్మించారు.

2వేల ఏళ్లు 

ఈ ఆలయం భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయం 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రధాన ఆలయం 2.77 ఎకరాల భూమిలో ఉంది. 70% ప్రాంతం పచ్చని తోటలు, నీటి వనరులు, చెట్లతో నిండి ఉంటుంది. 

అతిపెద్ద దేవాలయం

అయోధ్య ఆలయ తరహా ఆలయం థాయ్‌లాండ్‌లో ఉంది. దీనిని 2010లో థాయ్ యువరాణి అదుల్యదేజ్ రెండవ కుమార్తె నిర్మించారు. ధమ్మకాయ ఆలయం అని పేరు పెట్టారు. 

థాయ్‌లాండ్‌లో

ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేకమైన ఉద్యానవనం ఉంది. దీనిని జ్యోతిష్య నక్షత్రరాశుల ఆధారంగా నిర్మించారు. ఇందులో 27 నక్షత్రాలను సూచించే 27 రకాల మొక్కలు ఉంటాయి.

 ఉద్యానవనం 

ఆలయ ప్రాంగణంలో అయోధ్య చరిత్ర, రామ జన్మస్థలం గురించిన సందేశం ఉన్న టైమ్ క్యాప్సూల్ భూమి నుండి 2000 అడుగుల లోతులో పాతిపెట్టారు. ఇందులో అయోధ్య చరిత్ర, రామ జన్మస్థలానికి సంబంధించిన సాక్ష్యం ఉంది. 

 టైమ్ క్యాప్సూల్ 

ఆలయంలో వంట గది ఉంది. ఇది సందర్శకులకు,  అవసరమైన వారికి ఉచిత ఆహారాన్ని అందిస్తుంది. ఒకేసారి 10,000 మందికి ఆహారం అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. 24 గంటల్లో పని చేస్తుంది

 10,000 మందికి ఆహారం