ఈ గుడిలో రావణుడికి ముందు పూజలు.. తర్వాత శివయ్యకు..
13 April 2025
Prudvi Battula
రాజస్థాన్లోని ఉదయపూర్కు 80 కిలోమీటర్ల దూరంలో మహాదేవుని కమల్నాథ్ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని లంకాపతి రావణుడు నిర్మించాడని ప్రతీతి.
ఝండోల్ తహసీల్లోని అవర్ఘర్ కొండలపై 'కమలనాథ మహాదేవ' అని పిలువబడే ఆలయంలో లంకా రాజు రావణుడు శివలింగాన్ని స్థాపించాడు.
హిందూ విశ్వాసం ప్రకారం శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు రావణుడు తన తలను నరికి ఇక్కడి అగ్నిగుండంలో సమర్పించాడని ప్రతీతి.
రావణుని తలను నరికి సమర్పించిన తరువాత మహాదేవుడు శివుడు సంతోషించి, లంకాపతికి తన నాభిలో అమృతం భాండాన్ని అనుగ్రహించాడు.
రావణుడి తపస్సు చేస్తున్న సమయంలో 108 తామర పువ్వులలో ఒక పువ్వు తక్కువ అయింది. దీంతో లంకాపతి అతని తలను నరికి తామర పువ్వుగా శివుడికి సమర్పించాడు.
భోళా శంకరుడు లంకా రాజు రావణబ్రహ్మ భక్తికి సంతోషించి రావణునికి పది తలలను వరంగా ఇచ్చాడు. దీంతో దశకంఠుడు అయ్యాడు.
ఈ ఆలయంలో శివుని దర్శించుకునే ముందు రావణుడిని పూజించకపోతే ఫలితం ఉండదని స్థానికులు నమ్ముతారు. అందుకే ముందు రావణుడిని పూజించి తర్వాత శివయ్యను దర్శనం చేసుకుంటారు.
శ్రీ రాముడు తన తండ్రి కోరిక మేరకు వనవాసం చేసే సమయంలో ఈ ఆలయ పరిసరాలలో కొంత కాలం గడిపాడని ఇక్కడ నమ్ముతారు.