అయోధ్యలో  ఏడు గుర్రాలపై స్వారీ చేస్తున్న సూర్య భగవానుడి విగ్రహం

25 December 2023

అయోధ్యలో రామయాల నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయోధ్య ప్రవేశద్వారం వద్ద 'సూర్యుని ఏడు గుర్రాలు' భక్తులకు స్వాగతం పలకడానికి రెడీ అవుతోంది.

 అయోధ్య ప్రవేశ ద్వారం

శ్రీ రాముడు సూర్యవంశస్థుడు.  సూర్యవంశానికి సంబంధించిన చిహ్నం ఎదుగుర్రాల రథం మీద పయనించే సూర్యుడు. ఏ వ్యక్తి అయినా అయోధ్యలో అడుగుపెట్టగానే ముందుగా చూసేది సూర్యుడితో పాటు గుర్రాల విగ్రహాలే.

సూర్యుడి విగ్రహం 

రామయ్య జన్మభూమి అయోధ్యలో ధర్మ మార్గంలో భారీ గేటు నిర్మిస్తున్నారు. ఈ ద్వారం వద్ద ఏడు గుర్రాల విగ్రహాలను ఏర్పాటు చేస్తారు.

ధర్మ మార్గంలో గేటు

ఎఫ్‌ఆర్‌పీ టెక్నాలజీతో విగ్రహాలను సిద్ధం చేస్తున్నామని హస్తకళాకారుడు హేమంత్ తెలిపారు. ఈ సాంకేతికత ప్రకారం, విగ్రహాల తయారీకి ప్రత్యేకమైన మట్టిని ఉపయోగిస్తారు. వివిధ రసాయనాలను కలిపి తాయారు చేస్తారు.

ప్రత్యేక మట్టి 

ఈ విగ్రహాలు ఎనిమిది మీటర్ల ఎత్తు మరియు తొమ్మిది మీటర్ల వెడల్పుతో ఉంటాయి. దీంతో ఆలయం నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరం నుండి కూడా కనిపిస్తాయి.  

2 కి.మీ వరకు కనిపిస్తుంది 

విగ్రహాల తయారీలో తనకు ఎదురైన అతిపెద్ద సవాలు వాతావరణానికి సంబంధించినదని  హస్తకళాకారుడు హేమంత్  చెప్పాడు. వాతారణం చల్లగా ఉంటుంది. కనుక విగ్రహాలు ఎండడానికి సమయం పడుతుంది.  

కళాకారుడు హేమంత్‌ 

ప్రస్తుతం ఈ గుర్రాల విగ్రహాలకు తెలుపు రంగును వేశారు. తర్వాత ఈ విగ్రహాలు మరింత అందంగా కనిపించేలా రంగురంగులను అద్దనున్నారు. 

దవళ వర్ణంలో