సరికొత్త రికార్డు సృష్టించిన ప్రధాని నరేంద్ర మోదీ..!

Phani CH

22 AUG 2024

చాలా మంది మాజీ ప్రధానులను వదిలి ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన ప్రధానుల జాబితాలో నరేంద్ర మోదీకి చోటు దక్కింది. ఇప్పుడు మరో రికార్డు సృష్టించాడు.

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ 98 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇది స్వతహాగా రికార్డుగా నిలిచింది.

దేశ ప్రధాని ఇంత సుదీర్ఘ ప్రసంగం చేయడం చరిత్రలో ఇదే తొలిసారి. తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నారు.

2016లో ప్రధాని మోదీ సుదీర్ఘ ప్రసంగం 96 నిమిషాలు. అదే సమయంలో, 2017లో 56 నిమిషాల పాటు అతి తక్కువ ప్రసంగం చేశారు మోదీ.

ప్రధాని మోదీ కంటే ముందు అత్యంత సుదీర్ఘ ప్రసంగం చేసిన రికార్డు మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందర్ కుమార్ గుజ్రాల్ పేరిట ఉంది.

అప్పట్లో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1947లో సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఇది 72 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం.

మాజీ ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్ 71 నిమిషాల ప్రసంగం సుదీర్ఘ ప్రసంగంలో చేశారు. ప్రధాని మోదీ ఈ రికార్డును కూడా బద్దలు కొట్టారు.