మార్చి 15 తర్వాత పేటీఎమ్ ఫాస్ట్‌ట్యాగ్ పని చేస్తుందా లేదా?

TV9 Telugu

11 March 2024

ఈ ఏడాది ప్రారంభంలో పేటీఎం ద్వారా ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ చేయడం లేదా డబ్బును యాడ్ చేయడం కుదరదన్న రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా.

ఎవరైనా పేటీఎమ్ ఫాస్ట్‌ట్యాగ్‌ను రద్దు చేయాలనుకుంటే కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్‌ను సంప్రదించాలని వెల్లడి.

భారతీయ రిజర్వు బ్యాంకు కఠినమైన నిర్ణయం తర్వాత అనేక సమస్యలను ఎదుర్కొంటున్న పేటీఎమ్ ఫాస్ట్‌ట్యాగ్ కస్టమర్లు.

ఈ ఏడాది మార్చి 15వ తేదీ తర్వాత ఫాస్ట్‌ట్యాగ్ సేవలు కంటిన్యూ అవుతాయా లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది.

మార్చి 15వ తేదీ తర్వాత కూడా పేటీఎమ్ ఫాస్ట్‌ట్యాగ్ సేవలు కచ్చితంగా పని చేస్తుందని ప్రకటించింది కంపెనీ.

ఇకపై భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదని పేటీఎం కంపెనీ యాప్‌లో టాప్ అప్ మెసెజ్‌తో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం.

పేటీఎమ్ ఫాస్ట్‌ట్యాగ్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ మనీ రిటర్న్ అవుతుందా సందేహం అక్కర్లేదని కంపెనీ క్లారిటీ.

పేటీఎమ్ ఫాస్ట్‌ట్యాగ్ గురించి మరింత సమాచారం కోసం, యాప్‌లో లేదా కస్టమర్ కేర్ నెంబర్‌ను కాంటాక్ట్ అవ్వండి.