ఎర్రకోటపై రెపరెపలాడిన మువ్వన్నెల పతాకం.. మన్మోహన్ రికార్డును మోదీ సమం.. 

15 August 2023

దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జారుతున్నాయి.ఢిల్లీలోని ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగురువేశారు ప్రధాని నరేంద్ర మోదీ.

రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించి ఎర్రకోటకు చేరుకుని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

వరుసగా పదోసారి ప్రధానిగా మోదీ ఎర్రకోటపై జెండా ఎగురువేయడాంతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రికార్డు సమం అయ్యింది.

అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ బాపూజీ చూపించిన అహింసా మార్గంలోనే స్వాతంత్య్రం సాధించామని పేర్కొన్నారు.

భారత్‌లో జీ20 సమావేశాలు దేశ సామర్థ్యం, వైవిధ్యాన్ని ప్రపంచం ముందుంచాయి.. జీ20 సమావేశాలు ప్రపంచానికి కొత్త భారతాన్ని పరిచయం చేశాయి.

మారుతున్న ప్రపంచంలో భారత్‌ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది.. తొలుత దేశమే అన్న ఆలోచనలతో జాతి ముందడుగు వేస్తోంది అన్నారు.

ఈ వేడుకల్లో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు.

ఈసారి ముఖ్య అతిథులుగా 1,800 మంది సామాన్యులైన రైతులు, నర్సులు, ఉపాధ్యాయులు, నేత కార్మికులు హాజరయ్యారు.