బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు

TV9 Telugu

31 March 2024

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

ముంబై - ఎస్‌ఆర్‌హెచ్‌ మధ్య జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా హైదరాబాద్‌కు తాజాగా వచ్చారు నీతా అంబానీ.

బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని బ‌ల్కంపేట ఎల్లమ్మ పోచ‌మ్మ ఆల‌యంలో నీతా అంబానీ ప్రత్యేక పూజ‌లు నిర్వహించారు.

సుమారు 15 నిమిషాల పాటు అమ్మవారి ఆల‌యంలో ప్రత్యేక పూజలు చేసిన నీతా అంబానీ అద్దాల మండ‌పాన్ని ద‌ర్శించారు.

ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉన్న ప్రతీ సందర్బంలో నీతా అంబానీ ముందుగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడం అలవాటు.

ఆల‌య ఈఓ కుంట నాగ‌రాజు, ఛైర్మన్ కొత్తప‌ల్లి సాయిబాబాగౌడ్ నీతా అంబానీకి స్వాగ‌తం ప‌లికారు అమ్మవారి తీర్థప్రసాదాలు అంద‌జేశారు.

ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ - ముంబై ఇండియన్స్ మధ్య హోరా హోరీగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓటమి పాలైంది.

ఈ మ్యాచ్ ను విక్షించేందుకే ముకేశ్ అంబానీ సతీమణి హైదరాబాద్‌కు వచ్చారు. బల్కంపేట ఎల్లమ్మ దర్శనం తర్వాత స్టేడియంకి చేరుకున్నారు.