ఢిల్లీలో రెండ్రోజులు జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ఆదివారంనాడు ముగిసింది. భారత్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహా పలువురు ప్రపంచ అగ్రనేతలు తరలివచ్చారు.
జీ20 సదస్సులో పాల్గొన్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అందరి మనసులో దోచాడు. సునాత్ తన సతీమణి అక్షతా మూర్తి(ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె)తో కలిసి భారత పర్యటనకు వచ్చారు.
సదస్సులో పాల్గొన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను రిషి సునాక్ పలకరించిన తీరు పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
షేక్ హసీనాను రిషి సునాక్ ఆప్యాయంగా పలకరిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సునాక్ నిరాడంబరతకు నెటిజన్లు ఫిదా అయ్యారు.
ఈ ఫొటోపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్న నెటిజన్లు.. మా మనసులు దోచావంటూ రిషి సునాక్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
బ్రిటన్ ప్రధాని హోదాలో తొలిసారిగా భారత్ పర్యటనకు వచ్చారు రిషి సునాక్. భారత పర్యటనలో భాగంగా తన సతీమణి అక్షతా మూర్తితో కలిసి ఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయాన్ని దర్శించుకున్నారు.
తన భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర విదేశీ నేతలతోనూ సునాక్ విడిగా భేటీ అయ్యారు. వారితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.