11.5 కోట్ల పాన్ కార్డులను తొలగించిన కేంద్రం.. ఎందుకంటే...!

11 November 2023

దేశవ్యాప్తంగా పాన్ కార్డులు కలిగిన ఉన్న చాలామంది వినియోగదారలుకు షాకిచ్చింది భారత దేశ కేంద్ర ప్రభుత్వం.

ఆధార్‌తో పాన్ కార్డులు లింకు చేసుకోలేదని దేశవ్యాప్తంగా 11.5 కోట్ల కార్డులను డీయాక్టివేట్ చేసిన కేంద్రం.

ఎప్పటి నుంచో ఆధార్‌తో పాన్ కార్డులు లింకు చేసుకోవాలని సూచించిన కేంద్రం.. పలుమార్లు గడువు పెంచుతూ వచ్చింది.

ఈ ఏడాది జూన్ 30తో గడువు తేదీ ముగియడంతో 12 కోట్లకు పైగా పాన్ కార్డులు ఆధార్‌తో లింక్ లేదని గుర్తించింది కేంద్రం.

మధ్యప్రదేశ్ కు చెందిన చంద్రశేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు సీబీడీటీ సమాధానమిస్తూ.. వివరాలు వెల్లడించిన ఇన్‌కమ్ టాక్స్.

భారత దేశంలో ఆదాయ పన్ను శాఖ వారి పాన్ కార్డులు కలిగి ఉన్న వినియోగదారుల సంఖ్య 70.24 కోట్ల మందిగా ఉంది.

దేశవ్యాప్తంగా ఆధార్ తో పాన్ కార్డును అనుసంధానం చేసుకున్న వినియోదారుల సంఖ్య కేవలం 57.25 కోట్ల మంది మాత్రమే.

2017 జులై 1వ తేదీకి ముందు పాన్ కార్డు పొందిన వారికి ఆధార్ ‌తో లింక్ చేసే సౌలభ్యం లేదు. వారు తమ పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేసుకోవడం తప్పనిసరి.