2050 నాటికి దేశంలో అత్యధికంగా ఉపయోగించే గృహోపకరణం ఏదంటే

25 October 2023

ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న వేడి కారణంగా ఏసీకి డిమాండ్ బాగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.

2050 నాటికి భారత దేశంలో అత్యధికంగా ఉపయోగించే గృహోపకరణంగా ఎయిర్ కండీషనర్ ఉండనుందని అంచనా వేశారు నిపుణులు.

పెరుగుతున్న వేడి, వ్యక్తుల ఆదాయాల వృద్ధి వంటి కారణల వల్ల 2010 నుంచి ఏసీ వినియోగం 3 రెట్లు పెరిగింది.

గత 5 దశాబ్దాలలో, భారతదేశం 700 కంటే ఎక్కువ వేడి తరంగాలను చూసింది. ఇందులో 17,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

దేశవ్యాప్తంగా ప్రతి 100 ఇళ్లలో 24 మంది ఇళ్లకి AC కనెక్షన్లు ఉన్నట్లు వెల్లడిస్తున్నయి తాజా అధ్యయనాలు.

2019 - 2022 మధ్య స్పేస్ కూలింగ్ కారణంగా విద్యుత్ వినియోగం పెరుగుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ వెల్లడి.

IEA వరల్డ్ ఎనర్జీ అవుట్‌లుక్ ప్రకారం 2050 నాటికి దేశీయ ఎయిర్ కండిషనర్ల వాడకం 9 రెట్లు పెరగవచ్చని అంచనా.

టెలివిజన్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్‌తో సహా అన్ని ఇతర గృహోపకరణాల వినియోగాన్ని అధిగమిస్తుందని అంచనా వేసింది.