నంద్యాలలో అందుబాటులోకి వచ్చిన వేల ఏళ్లనాటి గుహలు

TV9 Telugu

02 February 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లాలో వేల ఏళ్ల నాటి గుహలు.. మహాకవి వాల్మీకీ రామాయణం రాసిన చోటు ఇదేనా..?

ఆంధ్రలోని బేతంచెర్ల మండలంలో సహజ సిద్ధంగా ఏర్పడిన వేల ఏళ్లనాటి బిలస్వర్గం గుహలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

ఇన్నాళ్లూ ఎలాంటి అభివృద్ధికీ నోచుకోక నిష్ప్రయోజనంగా మిగిలిపోయిన గుహలు. ఇటీవల ఆ గుహలను 10 కోట్లతో అభివృద్ధి చేయించి పర్యాటక స్థలంగా తీర్చిదిద్దారు.

సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఈ బిలస్వర్గం గుహలు జనవరి 29 నుంచి ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి వచ్చాయి.

ప్యాపిలి మండలంలోని బోయవాళ్లపల్లి దగ్గర ఉన్న వాల్మీకి గుహలను సైతం అభివృద్ధి చేయించారు పర్యాటక శాఖ అధికారులు.

రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చొరవతో ఈ గుహలు సహజత్వం కోల్పోకుండా వాటికి కొత్త రూపు తీసుకొచ్చారు.

ఈ గుహలు విద్యుత్‌ దీపాల అలంకరణలతో రారమ్మని పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి. వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఈ గుహలోనే రచించారు.

ఇక్కడి శివలింగాలు ఎంతో పురాతనమైనవి... ప్రసిద్ధి చెందినవిగా స్థానికులు చెబుతారు. ఎట్టకేలకు గుహలు కొత్తరూపాన్ని సంతరించుకుని పర్యాటకులకు కనువిందుచేస్తున్నాయి.