హైదరాబాద్ టూ అరకు మద్యలో అన్నవరం..

TV9 Telugu

04 July 2024

తెలంగాణ టూరిజం తాజాగా అరకు వెళ్లే వాళ్ళ కోసం ప్రత్యేక టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. అరకు టూర్ పేరుతో దీని తీసుకొచ్చింది.

తెలంగాణ టూరిజం ప్రతి బుధవారం ఈ ప్యాకేజీ అందుబాటులో తీసుకొచ్చింది.ఈ టూర్ మొత్తం 4 రోజులు కొనసాగుతుంది.

ఈ ప్యాకేజీలో అన్నవరం, సింహాచలం, వైజాగ్, ఆర్కే బీచ్, కైలాసగిరి, అరకు, బొర్రా గుహలు, అనంతగిరి హిల్స్ చూపించనున్నారు.

హైదరాబాద్ లోని పర్యాటక భవన్ దగ్గర నుంచి బుధవారం సాయంత్రం ప్రారంభమైన జర్నీ తర్వాత రోజు ఉదయం 6 గంటలకు విశాఖపట్నం చేరుతుంది.

హోటల్ లో చెకిన్ చేసి ఫ్రెష్ అయినా తర్వాత సింహాచలం, కైలాసగిరి, రుషికొండ బీచ్, సబ్ మైరైన్ మ్యూజియంను సందర్శిస్తారు.

సాయంత్రం విశాఖపట్నంలో ఫేమస్ ఆర్కే బీచ్ ను చూస్తారు. ఆ రోజు రాత్రి వైజాగ్ లోని హోటల్ లో బస చేస్తారు.

తర్వాత రోజు తెల్లవారుజామునే బయలుదేరి అద్బుతమైన ప్రకృతి అందాల మధ్య జర్నీ చేస్తూ ఉదయం 6 గంటలకు అరకు చేరుకుంటారు.

అక్కడ ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి, కాఫీ ప్లానిటేషన్, బుర్ర గుహలు, దింసా నృత్యంను చూసి రాత్రి అరకులోనే గడుపుతారు.

తర్వాత నాల్గో రోజు ఉదయాన్నే బయలుదేరి అన్నవరం చేరుకొని సత్యదేవుని దర్శనం అనంతరం హైదరాబాద్ రిటర్న్ అవుతారు.

ఈ జర్నీ నాన్ ఏసీ బస్సులో ఉంటుంది. పెద్దవారికి రూ. రూ. 6,999గా ఉంది. పిల్లలకు 5.599గా ధర నిర్ణయించారు.