హైదరాబాద్ నుంచి తిరుపతి, కాకినాడకు ప్రత్యేక రైళ్లు
25 December 2023
TV9 Telugu
ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్- తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.
హైదరాబాద్ - తిరుపతి స్పెషల్ ట్రైన్ డిసెంబర్ 29 సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది
తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 30 రాత్రి 8.25కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.50కి హైదరాబాద్కు చేరుకుంటుంది.
హైదరాబాద్–తిరుపతి అనే మరో స్పెషల్ ట్రైన్ డిసెంబర్ 27 సా. 6.10కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.45కు తిరుపతి చేరుకుంటుంది.
ఈ ట్రైన్ తిరుగు ప్రయాణంలో 28న సాయంత్రం 5.15కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.30కు హైదరాబాద్ చేరుకుంటుంది.
హైదరాబాద్–కాకినాడ స్పెషల్ ట్రైన్ డిసెంబర్ 29న రాత్రి 8.30కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 30వ తేదీ రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయానికి తిరుపతి, కాకినాడ వెళ్లే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి