భారత్‎లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్‎లో  కొన్ని ఇవే.. 

TV9 Telugu

12 August 2024

రామప్ప దేవాలయం తెలంగాణలోని పాలంపేట్ గ్రామంలో ఉంది. ఈ ఆలయం కనీసం 800 నుండి 900 సంవత్సరాల నాటిదని అంచనా.

ఎలిఫెంటా గుహలు బౌద్ధ, హిందూ గుహలకు ప్రసిద్ధి చెందింది. ఇది అరేబియా సముద్రంలో ద్వీపంలో ఉంది. మరియు బేసల్ రాక్ గుహలు మరియు శివాలయాలు ఉన్నాయి.

ప్రపంచంలోని ఏడు వింతలలో ఆగ్రాలో తాజ్ మహల్ ఇండియా ఐకానిక్ స్మారక చిహ్నం. యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో తాజ్ మహల్ ఒకటి.

మధ్యప్రదేశ్‌లోని ఖజురహో ఆలయ స్మారక చిహ్నాలు 10వ శతాబ్దానికి చెందినవి. ఈ స్మారక చిహ్నాలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.

మహారాష్ట్రలో ఉన్న అజంతా, ఎల్లోరా గుహలు క్రీ.పూ 2వ శతాబ్దానికి చెందినవని. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో అంజతా, ఎల్లోరా గుహలు కూడా ఉన్నాయి.

భారత రాజధాని న్యూఢిల్లీలో ఉన్న కుతుబ్ మినార్.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన నిర్మాణాలలో ఒకటి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఇది కూడా ఒకటి.

కర్ణాటకలోన హంపి స్మారక చిహ్నాలు ఒకప్పటి విజయనగర సామ్రాజ్య రాజధాని అవశేషాలకు విస్తారమైన స్మారక చిహ్నం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో ఇవి కూడా ఒకటి.

భారత ఉపఖండానికి తూర్పు తీరంలో ఉన్న కోణార్క్ సూర్య దేవాలయం భారతీయ వాస్తుశిల్పానికి అత్యుత్తమ ఉదాహరణలలో ఒకటి.