పసుపు ఎక్కువగా తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు

12 August 2023

షుగర్‌ పేషెంట్స్‌కి పసుపు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ పసుపు తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్‌ లెవల్స్‌ పెరిగే అవకాశం ఉంటుంది 

పసుపులోని కర్కుమిన్‌ మూలకం జీర్ణక్రియ సమస్యలకు కారణమవుతుంది. విరేచనాలు, వాంతులు అయ్యే అవకాశాలు ఉంటాయి. 

ఐరన్‌ లోపంతో బాధపడే వారు పసుపును ఎక్కువగా తీసుకోకూడదు. ఇలా చేస్తే ఈ సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి 

కామెర్లతో బాధపడే వారు పసుపును వీలైనంత వరకు తక్కువగా తీసుకోవాలి. లేదంటే ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉంటుంది. 

ఇక అలర్జీతో ఇబ్బంది పడే వారు కూడా పసుపు తక్కువ తీసుకుంటేనే మంచిది. పసుపు వల్ల అలర్జీ సమస్య తీవ్రమవుతుంది 

కొందరు శరీరంలో వేడి కారణంగా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు కూడా పసుపును తక్కువ తీసుకోవాలి. లేదంటే మరింత వేడి అవుతుంది 

ఇక పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది 

చూశారుగా పసుపు ఆరోగ్యానికి ఎంత మంచిదో ఎక్కువగా తీసుకుంటే అంతే ప్రమాదం కూడా. కాబట్టి మితంగా తీసుకోవడమే ఉత్తమం.