మీ ముఖం మెరిసిపోవాలంటే మందార పువ్వులను ఇలా ఉపయోగించండి..!!

12 November 2023

మీ ముఖం తెల్లగా, అందంగా మెరిసేలా చేయడానికి మందార పువ్వులు అద్భుతం ఔషధంగా పనిచేస్తాయి. మీ ముఖం మెరిసిపోవాలంటే మందార పువ్వులతో తయారు చేసిన ఇలాంటి ఫేస్‌ ప్యాక్స్‌ ట్రై చేయండి.. మీ ముఖంపై ముడతలు కూడా తగ్గిపోతాయ్.

మందార పువ్వు బాగా ఆరిన తర్వాత పొడిగా చేసి, అందులో ఒక టీస్పూన్ తేనె, నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి.10 నిమిషాల తర్వాత ముఖం కడగాలి.

ముల్తానీ పేస్ట్‌తో ఎర్రని మందార పూలను రుబ్బి, పెరుగు వేసి ముఖానికి పట్టించాలి. ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది.  మీరు నిద్రపోయే ముందు ఇలా చేయడం ఉత్తమం.

ముఖంపై ఉన్న మురికిని తొలగించి ముఖం తెల్లగా మారాలంటే మందార పొడిని పంచదార, శనగపిండి, పచ్చి పాలు కలిపి ముఖానికి రాసుకోవాలి.

మందార పువ్వును గ్రైండ్ చేసి అందులో కలబంద జెల్ కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మీ ముఖం కడుక్కోండి. మీ ముఖం మెరుస్తుంది.

టమాటా రసాన్ని మందార పొడిలో వేసి బాగా కలిపి ముఖానికి పట్టించాలి.  20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని కడుక్కోండి. మీ ముఖం మెరిసిపోతుంది.

బాగా ఆరిన మందార పూలా పొడి, గ్రీన్ టీ సమానంగా వేసి ప్రత్యేకమైన టీ తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయాలి. 

మందారం - అలోవెరా జెల్ ఫేస్ ప్యాక్ కూడా అద్భతం చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ని అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మీ ముఖం మెరిసిపోవాలంటే మందార పువ్వులతో తయారు చేసిన ఇలాంటి ఫేస్‌ ప్యాక్స్‌ తరచూ ట్రై చేయండి. కొద్ద రోజుల్లోనే మీ ముఖంలో చంద్రబింబంలాంటి కాంతిని చూస్తారు.